ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 07:01 PM

ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకోవాలి అని నిర్ణయించామని, కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారం ముందుకు వెళ్తామని అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర. కౌలురైతులకు కూడా మార్గదర్శకాలు జారీ చేశాం. కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు పెట్టారు. ఏపిలో మాత్రం రైతులు అందరికీ ఇస్తున్నాం. పించన్ కింద 24 వేలు, పసుపు కుంకుమ కింద రూ. 10 వేలు, ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇస్తున్నాం. 3 ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పెద్దకొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నా. ఏకపక్ష ఎన్నికకు ఇదొక అవకాశం. ఎన్నో కష్టాలలో కూడా ఇన్నికార్యక్రమాలు జరిగింది ఏపిలోనే అన్నారు. వైకుంఠపురం బ్యారేజికి శంకుస్థాపన చేశాం. ప్రకాశం బ్యారేజికి అటుఇటు 100కి.మీ జలకళ. అటు వైకుంఠపురం, ఇటు చోడవరం బ్యారేజి. రాజధాని అమరావతికి నీటికొరత రాదు. ఈరోజు విశాఖ డేటా సెంటర్లకు శంకుస్థాపన. రూ.70వేల కోట్ల పెట్టుబడి, పెద్దఎత్తున ఉపాధి.డే టా నాలెడ్జ్ లో వర్జీనియాకు ధీటుగా విశాఖపట్నం ఎదగనున్నది. ఢిల్లీలో 12గంటలు నిరాహార దీక్ష, ఆ మరునాడే పాదయాత్ర. నిన్న మళ్లీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీక్షకు హాజరయ్యాను.
ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం. మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ నిరంతర శ్రమ. నిరంతర శ్రమతోనే ఏదైనా సాధ్యం. అసమర్ధులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం. సమర్ధుల చేతిలోనే ప్రజాస్వామ్యం ఫలప్రదం. ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షకు గొప్ప స్పందన వచ్చింది. మోది పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత. జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలప్రదం.
అవకాశ వాదులకు టీడీపీలో స్థానంలేదు. కొందరు పోతే నష్టాలకన్నా లాభాలే మిన్న. నాయకులు రావడం, పోవడం మామూలే. కానీ కార్యకర్తలే టీడీపీని కాపాడుకుంటారు. కులముద్ర నాపై వేయాలని చూడటం దారుణం. విద్యార్ధి దశనుంచి నన్ను గౌరవించింది ఇతర కులాలే అన్నారు. నన్ను గౌరవించింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిలేనన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసగించింది వైఎస్. కాపు రిజర్వేషన్లపై సంబంధం లేదన్నది జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాపులకు ఏడాదికి రూ.1000కోట్లు బడ్జెట్ లో పెట్టాం. ఈబీసీ రిజర్వేషన్లలో 5% కాపులకే ఇచ్చాం. ఇచ్చినమాట నిలబెట్టుకుంది టీడీపీనేనని స్పష్టం చేశారు. వైసీపీ కులాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. మోదీ, జగన్, కేసీఆర్ ఆడే కుట్రలు ఇవి అని అన్నారు.
ఏపికి హోదా కోసం చిదంబరం కమిటి సిఫారసు. హోదా ఇవ్వాలని హోం పార్లమెంటరీ కమిటి నివేదిక ఇచ్చింది. ఏపికి హోదాపైనే తొలి సంతకం అని రాహుల్ చెప్పారు. వీటిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరు.? హోదా ఇస్తామన్న వారిని విమర్శిస్తాడు. హోదా ఎగ్గొట్టిన మోదిపై నోరు తెరవడు. ఏపీకి 22పార్టీలు మద్దతిస్తే వైసీపీ స్వాగతించదు. కేసీఆర్ తో కలిసి కుట్రలు చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ డ్రామాలు ఆడతారు. 5ఏళ్లు హైదరాబాద్ వదిలి రాలేదు. వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాలి. కసి, పట్టుదల ప్రజల్లో పెరగాలి. కుట్రదారులకు బుద్ది చెప్పాలి. టీడీపీ ధర్మపోరాటానికి అండగా ఉండాలి. అన్ని సీట్లలో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలి అన్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com