ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 07:02 PM

విజయవాడ:  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కమిటీలను నియమిస్తూ క్యాడర్ ని అలెర్ట్ చేసిన పవన్ తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అప్పటి నుండే అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ‌ను ప్రారంభమైంది. విజ‌య‌వాడలోని జనసేన ప్రధాన కార్యాల‌యంలో మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీ బయోడేటాల పరిశీలన ప్రారంభించగా ఎనిమిది జిల్లాల నుండి ఆశావహులు జనసేన కార్యాలయానికి వచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ ఉంటుందన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గంగాధరం వామపక్షాలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని .. మార్చిలో పవన్ తొలి జాబితా ప్రకటిస్తారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com