హైదరాబాద్: అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అవంతి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన అవంతి పార్టీకి, పదవికీ రాజీనామా చేశానని.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని చెప్పారు. ఇక టీడీపీ, సీఎం చంద్రబాబుపై పలు విమర్శలు చేసిన అయన జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నచ్చే వైసీపీలో చేరనున్నారు.