ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్నారు. జిల్లాలోని కోటబొమ్మాళి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.