అమరావతి : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు, సభ్యుల నియామక ఉత్తర్వులు ఇవాళ విడుదలయ్యాయి. విశ్రాంత ఆచార్యులు కొలకనూరి ఇనాక్ ఏపీ సాహిత్య అకాడమీ నూతన చైర్మన్గా నియామకమైన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్గా అట్టాడ అప్పల నాయుడు(నవలా రచయిత), మెంబర్లుగా నరంశెట్టి ఉమామహేశ్వర రావు(కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత), డాక్టర్ కే. ప్రతాప్ కుమార్(ప్రముఖ రచయిత), కంతేటి శివరామ కుమార్(రచయిత), జగదాత్రి(రచయిత), రసరాజు(కవి, గాయకుడు), పి. రజని(కవి), నాగ భైరవ ఆదినారాయణ, ఆర్ఎం ఉమా మహేశ్వర్రావు, పి. దక్షిణమూర్తి, డాక్టర్ వీఆర్ రసని నియామకం అయ్యారు.