మాజీ మంత్రి స్వర్గీయ లక్ష్మీదేవి కుమారుడు బికె శివాజీ మృతి పట్ల పీసీసీ ప్రసిడెంట్ రఘువీరారెడ్డి సంతాపం ప్రకటించారు. శివాజీ మృతదేహన్ని సందర్శించిన రఘువీరా ఆయన పార్థీవదేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం శివాజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరోవైపు వైసీపీ నాయకులు కూడా శివాజీ మృతి పట్ల తమ విచారం వ్యక్తం చేశారు.