ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. వేణు స్వామి భార్య షాకింగ్ రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 08:51 PM

సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయ ప్రముఖుల వరకూ అందరి జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన వ్యక్తి వేణు స్వామి. ఇక ఆయన భార్య శ్రీవాణి సైతం.. వీణతో రాగాలు పలికిస్తూ వీణ శ్రీవాణిగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల వేణు స్వామిపై కేసు నమోదైన సమయంలోనుూ.. తన వీడియో ద్వారా వైరల్ అయ్యారు శ్రీవాణి. భర్తకు మద్దతుగా వీడియో రిలీజ్ చేసి.. ఘాటుగా రియాక్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విషయంలో వేణు స్వామి భార్య శ్రీవాణి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే తిరుమల లడ్డూ వ్యవహారం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇక ఈ విషయంపైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సోమవారం ఆ పిటిషన్ మీద సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. వేణు స్వామి భార్య శ్రీవాణి స్పందించారు. ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.


" పరమపవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను హింసించేశారు. రాజకీయ నాయకులను పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా..? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా? ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా?" అంటూ శ్రీవాణి వీడియో విడుదల చేశారు.


మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని.. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ అప్పట్లో వేణు స్వామి జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే ఇంటర్వ్యూలలో చెప్తూ వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆయనంటే వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్ జగన్‌కు అనుకూలంగా, వైసీపీకి మద్దతుగా జోస్యం చెప్తారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ట్రోలింగ్ ఓ రేంజులో సాగింది. టీడీపీ కూటమి రికార్డు విక్టరీ సాధించడంతో వేణు స్వామి జ్యోతిష్యం ఏమైందంటూ సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వేణు స్వామి భార్య శ్రీవాణి తిరుమల లడ్డూ వివాదంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com