విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొమరాడ మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటిపాం రోడ్డు వంతెన పై నుండి బైక్ పై వెళుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ వంతెన పై నుండి కిందికి బైక్తో సహా పడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి పార్వతీపురానికి చెందిన శేషారెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.