డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రైతుల ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచామన్నారు. ఓ అన్నగా ఆడబిడ్డలకు రెండు విడతల్లో ఆర్థిక సాయం అందజేస్తానని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో 94లక్షల మందికి ‘పసుపు-కుంకుమ’ కింద ఆర్థికసాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..రెట్టింపు చేసిన పింఛన్లు 54లక్షల మందికి ఇస్తున్నామన్నారు. ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. చర్మకారులు, డప్పు కళాకారులకు కూడా పింఛన్లు ఇస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా కింద రూ.5లక్షలు ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన భోజనం పెడుతున్నామన్నారు.రైతుల ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచామన్నారు. ఓ అన్నగా ఆడబిడ్డలకు రెండు విడతల్లో ఆర్థిక సాయం అందజేస్తానని చంద్రబాబు తెలిపారు.