ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకు అండగా ఉంటాం, బయపడకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2024, 12:29 PM

టీడీపీ నేతలు రెచ్చిపోయి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడుతున్నార‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలని కాకాణి సూచించారు.  వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దు, ధైర్యంగా ఉండాలి. టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలను అందరం కలిసి ఎదుర్కొందాం. కార్యకర్తలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com