ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకంపై ,,,క్లారిటీ ఇదే, రూ.25 లక్షల వరకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 08:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో.. ఈ పథకం అమలు చేయరా అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు రాష్ట్రానికి వస్తాయని పెమ్మసాని అన్నారు.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా రూ.5 లక్షల మేర వైద్య సేవలు అందనున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలతో కొంత గందరగోళం ఏర్పడింది.. ఆరోగ్యశ్రీని అమలు చేయరా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ అంశంపై స్పందించారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.


'ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (తెలుగుదేశం పార్టీ) చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా?' అని ప్రశ్నించారు.


'గత వైసీపీ ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం'అంటూ ట్వీట్ చేశారు.


మరోవైపు ఆరోగ్యశ్రీపై ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కీలక ప్రకటన చేసింది. 'ఆరోగ్యశ్రీ నిలిపివేత ప్రచారం అవాస్తవం. దురుద్దేశ్య పూర్వకంగా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సరికొత్తగా ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌టీఆర్ వైద్య సేవ స్కీమ్ పేరున రూ. 25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలను అమలుచేస్తోంది' అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com