ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధిని మరిచి, దాడులపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2024, 12:27 PM

టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి తిరుపతి రూయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్త తంగా పేచీ రాజ్ ని తిరుపతి ఎంపీ గురుమూర్తి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....  ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎవరూ ప్రోత్సహించ రాదని ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా కూడా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ దాడికి సంబంధించి స్థానిక సీఐతో మాట్లాడి విచారణ పారదర్శకంగా జరిపి నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com