ప్రజల ప్రశాంత జీవనానికి అటంకం కలిగించే అసాంఘిక శక్తులను చట్ట ప్రకారం అణచిచేస్తామని విజయవాడ తూర్పు నియోజ కవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం 7వ డివిజన్ ఆర్సీఎం చర్చి ప్రాంతంలో ఆయన పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వీధిలైట్లు వెలగడం లేదని రాత్రివేళ ఇబ్బందిగా ఉందని, చీకటిగా ఉం డడంతో గంజాయిమూకలు చేరి అల్లర్లకు పాల్పడుతున్నారని స్థానిక మహిళ లు ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్సీఎం చర్చి ప్రాంతంలో ఖాళీ స్థలంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తామంతా కుట్టుపని నేర్చుకుంటామని ఎమ్మెల్యేను కోరారు. కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని, గంజాయి మూకల సమస్య లేకుండా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్కు కేంద్రంగా రాష్ట్రం మారిందని అన్నా రు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వారిపైన, వాడుతున్న వారిపైనా టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత నెలలో గంజాయిమూకల దాడిలో గాయపడిన వర్లపర్ల సతీష్కు వైద్య ఖర్చుల నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ.10 వేలు అందించారు. టీడీపీ బూత్ కన్వీనర్ బట్టు మధు తండ్రి జార్జి మరణించడంతో వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్య క్రమంలో డివిజన్ అధ్యక్షుడు పటమట సతీష్చంద్ర, సొంగా సంజయ్వర్మ, పెనుగొండ శ్రీను, దోమకొండ రవి, రత్నాకర్, పర్సా లక్ష్మణ్, పెరవలి శివ కుమార్, ప్రభుప్రకాష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.