ఖరీఫ్ పంట నిమిత్తం రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు విజయవాడ రూరల్ మండలం డిప్యూటీ తహసీల్దార్ పఠాన్ సలీంకు గురువారం ఆయన కార్యా లయంలో వారు వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలను రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా రైతులకు అందించాలన్నారు. అలాగే రూ.5 లక్షల వరకు రుణాలను పావలా వడ్డీతో రైతు, కౌలు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కాలువలు, మైనర్ కాలు వలతో పాటు డెల్టా ప్రాంతంలో మురుగు నీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పాల్గొన్నారు.