ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:11 PM

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్‌ నసీర్‌ చెప్పారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని హిందూ కాలేజీ ఏడీ హాల్లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆటస్థ లాలు, లైబ్రరీ, ల్యాబ్‌లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ఉన్నత శిఖరాలకు విద్యార్థులు బాటలు వేసుకోవా లన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా వారందరికీ తల్లికి వందనం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి పి.వెంకటేశ్వరరావు, ఎంఈవోలు వి.వెంకటే శ్వరరావు నాగేంద్రమ్మ, కార్పొరేటర్లు పి.సమత, చిష్టీ, ఖాసిం, సలీం, సత్యం, హఫీజ్‌, అన్వర్‌, ముఖరం, వివిధ ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com