ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీలో చేరికలపై స్పందించిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:10 PM

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం జేఎన్‌రోడ్డులోని చెరుకూరి కన్వెన్సన్‌లో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అధ్య క్షతన జరిగిన ఎన్‌డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. గడచిన ఐదేళ్లలో చాలా ఇబ్బం దులు పడ్డామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెం టనే పారిశుధ్యంపై దృష్టిపెట్టానన్నారు. కొంతమంది అధికారుల్లో ఇంకా పాత వాసనలు పోవడం లేదన్నారు. వారంతా మారాలని సూచించారు. బ్లేడుబ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామన్నారు. వైసీపీ నాయకుల అండతో రెచ్చిపోతున్న బ్యాచ్‌లు ఆలోచించుకుని పూర్తిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. కూటమి విజయానికి పనిచేయకుండా కొంతమంది ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు పార్టీల్లో ఏదొక పార్టీలో చేరి చెలాయించాలంటే కుదరదని చెప్పారు. ఏ పార్టీలో చేరికలు ఉన్నా మూడు పార్టీల అధ్యక్షులు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం 42 డివిజన్లలో ఎవరెవరు కూటమి విజయానికి కష్టపడి పనిచేశారో తనకు తెలుసునన్నారు. కష్టపడిన వారికి ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందన్నారు. మా కుటుంభాన్ని ఆదరిస్తున్న రాజమహేంద్రవరం ప్రజలకు సదా రుణపడి ఉంటాటామన్నారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం కానీ రీల్స్‌ స్టార్‌ భరత్‌కు డిపాజిట్‌ రాకుండా చేయలేకపోయమనే బాధ ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన అఽధినేత పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను సత్కరించారు. సుమారు 4 వేల మంది ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొము్ముల దత్తు, యెనుముల రంగబాబు, చల్లా శంకర్రావు, కాశి నవీన్‌కుమార్‌, జనసేన నగర అధ్యక్షుడు వైశ్రీను, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, కుడుపూడి సత్తిబాబు, దొండపాటి సత్యంబాబు, ప్రియా సౌజన్య, రేలంగి శ్రీదేవి, మాలే విజయలక్ష్మి, యెనుముల రంగబాబు, వర్రే శ్రీనివాసరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com