నంద్యాల జిల్లాలో ఎరువుల హోల్ సేల్ వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, అక్రమాలకు, అక్రమార్జనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ హెచ్చరించారు. గురువారం పలు ఎరువుల హోల్సేల్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ.... రిరీటైల్ డీలర్లకు హోల్సేల్ వ్యాపారులు సక్రమంగా ఎరువులను సరఫరా చేయాలని, రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రిజిస్టర్లు, గ్రౌండ్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలని, గోడౌన్ ప్రకారం స్టాక్ రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించకూడదని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా వెంకట శివసాయి ఫర్టిలైజర్స్లో ఎరువుల నిల్వలు, స్టాక్ బుక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఇతర ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏడీఏ రాజశేఖర్, ఏవో ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.