ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీశాఖ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 05:03 PM

విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధిలోని పార్వతీనగర్‌ గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ జెన్‌కో అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన గిరిజనులు గురువారం స్థానిక సర్పంచ్‌ దుర్జో, ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి వినతి పత్రం అందజేశారు. తాము గిరిజన జాతికి చెందిన కోందులమని, తాము గత 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి పార్వతీనగర్‌ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని సీలేరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా అటవీశాఖ అధికారులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ స్థానిక నాయకులు, అప్పటి జీకేవీధి తహసీల్దార్‌ తమకు అండగా నిలవడంతో ఇప్పటి వరకు ప్రశాంతంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఏపీ జెన్‌కో అధికారులు వచ్చి ఈ స్థలం వారిదని, ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, వారు ఇచ్చిన నోటీసులు తీసుకుని ఈ గ్రామం ఖాళీ చేయాలని పదేపదే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ వినితి పత్రంలో పేర్కొన్నారు. తాము గ్రామం ఏర్పాటు చేసుకున్నప్పుడు గతంలో ఎప్పుడూ ఏపీ జెన్‌కో అధికారులు ఎటువంటి నోటీసులు గానీ, సమాచారం గానీ ఇవ్వలేదని, కొత్త ప్రాజెక్టు నిర్మాణం కోసం తమను ఖాళీ చేయమంటే ఊరుకునేది లేదని గ్రామస్థులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com