మరొకసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. మంగళవారం పుల్లంపేట మండలం టి. కమ్మపల్లె పంచాయతీ ఎగువరెడ్డిపల్లి, బలిజపల్లిలో ఎంపీటీసీ చంగయ్య, సర్పంచ్ చెంగయ్య ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డిని, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులుని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.