సీఎం వైయస్ జగన్ పాలనపై అసత్యాలు, అవాస్తవాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్ విడుదల చేసిందని, దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రయోజనం కోసం వైయస్ జగన్ పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..... వైయస్ జగన్ గారి పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధితో రాష్టం ముందుకు దూసుకువెళ్తోంది. సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలు కోసం ఖర్చు చేస్తునమని అబద్దాలు ఆడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారు.అరాచకం చేశారు. గ్రామసచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పథకాలు నేరుగా గడపగడపకు చేరుతున్నాయి. 2014లో టీడీపీ 650 హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయలేదు.అందుకే టిడిపి మేనిఫెస్టోను పార్టీ అధికారిక వెబ్ సైట్ లో కూడా లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు నివాసం సమీపంలోనే ఇసుక దోపిడీ జరిగింది అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100కోట్ల జరిమానా వేసింది. టీడీపీ హయాంలో దళిత భూములు కబ్జాచేశారు.దళితుల మీద దాడులు జరిగాయి. దళితులపై దౌర్జన్యాలు,అరాచకాలు జరిగింది టిడిపి పాలనలోనే. రాష్ట్రం అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి వాటిని ప్రజలకోసం వినియోగిస్తున్నాం. పేదవాడు అభివృధ్దిచెందినా కూడా టిడిపి చూడలేకపోతోంది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో జగన్ గారు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారు. తెలుగుదేశం,బిజేపి,జనసేన కూటమి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎన్ని వేషాలు వేసినా పట్టించుకునే పరిస్దితిలో ప్రజలు లేరు. వారు విడుదల చేసే ఛార్జ్ షీట్ లను అసలు నమ్మరు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు జగన్ ని తిరిగి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.