తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు కోరారు. శుక్రవారం సుండుపల్లెలో ఆయన టిడిపి నాయకులను కలిశారు. రాజంపేటలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఊరువాడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.