ఒంగోలులో ఏటీఎం కేంద్రాలకు నగదు తరలించే వాహనంలో రూ. 65 లక్షలు నగదు చోరీకి గురైన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. సీఎంసీకి చెందిన వాహన సిబ్బంది భోజనం కోసం కర్నూలు రోడ్డులో వాహనాన్ని నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనం తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.