నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు బగ్గు రమణమూర్తి శనివారం నామినేషన్ వేయనున్నట్లు టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8 గంటలకు రమణమూర్తి తన స్వగ్రామం పోలాకి మండలం మబుగాంలో బయలుదేరిగా ర్యాలీగా నరసన్న పేటకు బయలుదేరుతారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు.