శాసనసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు (జనరల్) డిపాజిట్గా రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5వేలు చెల్లించాలి. ఎంపీ అభ్యర్థులు (జనరల్) రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.12,500, చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ మొత్తం నగదు రూపంలో నామినేషన్ సమర్పించిన సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. శాసన సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.40 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అంతకు మించి వ్యయమైతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.