రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జగన్ అరాచకపాలనతో ప్రజలు విసిగిపోయారని ఎన్డీఏ కూటమి పెడన అసెంబ్లీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడనలో చేనేత రంగాన్ని ప్రొత్సహించింది చంద్రబాబు నాయుడు మాత్రమేనని, చేనేతల ఆకలి చావులకు జగన్ కారణమయ్యారన్నారు. నాలుగు మండలాల్లో ఇసుక దోపిడీ చేసి, చెరువుల తవ్వకాల్లో రైతులను దోచుకొని నాయకులు జేబులు నింపుకున్నారన్నారు. తనను నమ్మి చంద్రబాబు సీటు కేటాయించారని, పవన్, బీజేపీ ఆశీస్సులతో ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాగిత కోరారు.