ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నామినేషన్ కి సిద్ధమైన గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:29 PM

భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం నామినేషన్‌ వేస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని తన ఇంటి వద్ద ఉదయం 10.54 గంటలకు నామినేషన్‌పై సంతకాలు చేసి, భీమిలి బయలుదేరి వెళతారు. ఆయనతో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, జనసేన నాయకులు పంచకర్ల సందీప్‌, ఇతర నాయకులు ఉంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భీమిలిలో నామినేషన్‌ సమర్పించి, అక్కడికి సమీపంలోని ఎనిమిది ఎకరాల్లో భారీ సమావేశం నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com