ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నామినేషన్ దాఖలు చేయనున్న పల్లె సింధూరారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:22 PM

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా పల్లె సింధూరా రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ మండల,పట్టణ కన్వీనర్‌లు రామకృష్ణ, ఒలిపిశీన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఉదయం 10 నుంచి 11గంటల సమయంలో పల్లె సింధూరారెడ్డి నామినేషన దాఖలు చేయనున్నారని తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, కాంట్రాక్టర్‌ లక్ష్మీనారాయణ, గాజుల చంద్ర, బండ్లపల్లిరాజు, నాగేంద్ర, నాగేంద్ర, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పల్లె సింధూర నామినేషన కార్యక్రమానికి నల్లమాడల మండల కూటమి శ్రేణులు తరలిరావాలని టీడీపీ మండలకన్వీనర్‌ మైలే శివశంకర్‌ ప్రకటనలో పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com