టీడీపీ యువనేత నారా లోకేష్ తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ-జనసేన-బీజేపీ ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో సర్వమత ప్రార్థనలతో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ప్రజల సమక్షంలో కూటమికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు గురువారం నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.34 గంటలకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ వేయనున్నారు. లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు లోకేష్ నామినేషన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి 10వేల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులతో భారీగా ర్యాలీ తీయాలని నిర్ణయించారు.