ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధులకి , దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌ సదవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:11 PM

వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌ హోం ఓటింగ్‌ సదుసాయం కల్పించింది. అందుకు సంబంధించి విజయనగరం జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రకాల కేటగిరీల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. కొవిడ్‌ బారిన పడిన వారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు... 40 శాతం పైబడి వైకల్యం ఉన్నవారు... 33 రకాల అత్యవసర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 29,174 మంది హోం ఓటింగ్‌కు ఉన్నట్లు బీఎల్‌వోలు గుర్తించారు. హోం ఓటింగ్‌ కావలసిన వారు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఫారం 12(డి) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి 26 నాటికి తుది జాబితా తయారు చేస్తారు. నామినేషన్లు ముగిసిన తరువాత.. బ్యాలెట్‌ పేపర్లు ముద్రించిన తరువాత వీరికి మే నెల 7 నుంచి 10వ తేదీ వరకూ హోం ఓటింగ్‌ నిర్వహిస్తారు. జిల్లాలో సుమారు 7,181 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న 21,993 మంది దివ్యాంగులు ఉన్నారు. హోం ఓటింగ్‌కు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అవకాశాన్ని కల్పిస్తారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, వీడియోగ్రాఫర్లు, మైక్రో అబ్జర్వర్‌తో పాటు బీఎల్‌వోలు, పార్టీల ఏజెంట్లు కూడా దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి... ఓటు తీసుకుంటారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా జరిగే ఈ విధానంలో కూడా దరఖాస్తుదారుని ఇంట్లో ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి... ఏకాంతంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అవసరమైన పక్షంలో కుటుంబ సభ్యులను మాత్రమే వారికి సహకారం అందించేందుకు అనుమతిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తారు. హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసే అవకాశం ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com