ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నామినేషన దాఖలు చేయనున్న సుజనా చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు మొదలుకానుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్టినగర్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ర్యాలీకి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు, బెలూన్లతో వన్ టౌన్ సందడిగా మారింది. ర్యాలీలో వంగవీటి రాధాకృష్ణ, కొనకళ్ల నారాయణ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీను, అడ్డూరి శ్రీరామ్, అమ్మిశెట్టి వాసు, రావి సౌజన్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com