ఇండియా-అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్-24 విన్యాసాలు బుధవారం కాకినాడ సాగరతీరంలో ప్రారంభమయ్యాయి. సూర్యారావుపేట నేవెల్ ఎన్క్లేవ్లో ఇరుదేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ టైగర్ ట్రయంఫ్-2024లో సైనిక విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. భారత్, యూఎస్ దళాల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.