ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమరణ నిరాహార దీక్ష దిగనున్న పరిటాల సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 04:56 PM

టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు మాజీ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. చంద్రబాబు కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శాంతియుతంగా చేపడుతున్న ఈ ఆమరణ దీక్షకు అందరూ సహకరించాలని కోరారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో నిందితులను రెడ్డిపల్లి జిల్లా జైల్లోనే హత్య చేశారని పరిటాల సునీత గుర్తుచేశారు. పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్షకు జనసేన రాష్ట్ర నేత భవాని రవికుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ నేత మల్లికార్జున సంఘీభావం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com