ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియంత పాలనకి చరమ గీతం పాడేరోజు ఆసన్నమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 04:57 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్‌ అన్నారు. రాంబిల్లి మండలంలోని జడ్‌.చింతువా పంచాయతీ వెంకటయ్యపాలెంకు చెందిన తొమ్మిది కుటుంబాలకు చెందిన వైసీపీ వారు ఆదివారం హరిపురంలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి విజయకుమార్‌ పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయకుమార్‌ మాట్లాడుతూ.....  రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి చోడిపల్లి మంగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు పప్పల నూకన్నదొర, ప్రధాన కార్యదర్శి చోడిపల్లి ప్రసాద్‌, పార్టీ నేతలు ఎరిపల్లి రాజు, నాగరాజు, గంగరాజు, సత్తిబాబు, కోదండరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com