ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి భయంతోనే ఆ కార్యక్రమాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 04:56 PM

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్ధానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఓటమి తధ్యం. అందుకనే పలుసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వాపోయారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....  త్వరలో వాహన మిత్ర కార్యక్రమానికి వస్తున్న సీఎం జగన్ స్ధానికంగా ఉన్న ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకోవాలి. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయం కోసం కార్మిక శాఖ భూమిని కాజేశారు. గత ఎన్నికలల్లో జగన్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి. జగనన్న కాలనీలోని ఇళ్లలో ఒక్క ఇల్లు అయినా నిర్మించారా. టిడ్కో ఇళ్లు పూర్తి అయినా ఒక్కరికైనా ఇచ్చారా.. ప్రశ్నిస్తున్నామనే భయంతో వైసీపీ ప్రభుత్వం జనసేన నిరసనలను అడ్డుకుంటుందని’’ అని పోతిన వెంకట మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com