శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం, పందిపర్తి పంచాయతీ పరిధిలోని మంచేపల్లి, బ్రహ్మణపల్లి పంచాయతీ పరిధిలో గల హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శంకర నారాయణ కి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది ని ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు , సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, సచివాలయ కన్వీనర్, గృహ సారథులు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.