విజయనగరం జిల్లా, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ....... నవరత్నాల పేరుతో జగన్రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లిలా రోజుకో రంగు మారుస్తూ పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నాశనం చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పటికే వందల కోట్లు బకాయిలు ఆసుపత్రులకి ఇవ్వకపోవడంతో పేదలు వైద్యాన్ని అందుకోలేకపోతున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యను పేద విద్యార్థులు దూరం చేసిన ఘనత జగన్రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యపానం నిషేధం అంటూ క్రమేపీ షాపులు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. ఇన్ని మోసాలు చేస్తున్న జగన్రెడ్డి కొత్తరంగు వేసుకొని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రజలందరూ గ్రహించాలని, అభివృద్ధి సంక్షేమం కావాలంటే చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు.