రేషన్ షాపుల ద్వారా మే నెల నుంచి రాగులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మోహన్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాకు 3, 180 టన్నుల రాగులను కేటాయించినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5. 03 లక్షల కార్డులు ఉంటే, వచ్చే నెల నుంచి ప్రతి కార్డుదారుడికి 1 నుం చి 3 కేజీల వరకు రాగులు ఇస్తామని, కార్డుదా రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన పేర్కొన్నారు.