‘‘సీఎం జగన్రెడ్డి తన తల్లిని, చెల్లిని ఎందుకు రోడ్డున పడేశాడు. ఆయన అరెస్టయ్యి జైలులో ఉన్నప్పుడు చెల్లి షర్మిల, తల్లి విజయలక్ష్మి రాష్ట్రమంతా పర్యటించారు. 2 రోజుల కిత్రం షర్మిల అరెస్టయితే మాట మాత్రంగానైనా ఎందుకు స్పందించలేదు? జగన్కున్న నైతికత ఏమిటో చెప్పాలి? తల్లిని పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని అడబిడ్డలకు అన్నగా, చిన్నారులకు మేనమామగా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు’’ అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న విమర్శించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ‘‘నైతిక విలువల గురించి మాట్లాడే ముందు త న నైతికత గురించి జగన్ తెలుసుకోవాలి. వివేకా కుమార్తె సునీతపై వైసీపీ సోషల్ మీడియా దారుణంగా ట్రోల్ చేస్తుంటే, జుగుప్సాకరంగా వేధిస్తుంటే దానిని నిరోధించలేదు. తన పార్టీ వారిని హెచ్చరించి సునీత పక్షాన ఎందు కు మాట్లాడడం లేదు? కేబినెట్ మంత్రులు, పార్టీ నాయకులతో జగన్ నైతిక విలువలపై బహిరంగ చర్చకు సిద్ధం’’ అని వెంకన్న సవాల్ చేశారు. ‘‘వివేకా హత్యపై చంద్రబాబును విచారించాలని అప్పటి గవర్నర్ నరసింహన్కు ఇచ్చిన లేఖ ఆధారంగా జగన్ను సీబీఐ విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. నాడు జగన్ అలా ఎందుకు చెప్పారో నిగ్గు తేల్చాలి. జగన్ అధికారం కోసం సొంత బాబాయిని చంపించి, ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టేయడానికి ప్రయత్నించారు’’ అని ఆరోపించారు.