ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్ కప్‍:జింబాబ్వేపై గెలుపు... బోణి చేసిన నెదర్లాండ్స్...

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 01:22 PM

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సికిందర్ రజా టాప్ స్కోరర్. రజా 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్సన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మాధేవెరె 1, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 3, వికెట్ కీపర్ చకబ్వా 5, మిల్టన్ శుంబా 2, ర్యాన్ బర్ల్ 2, ఎల్ జోంగ్వే 6, నగరవ 9, చతారా 6, ముజరబానీ 1 పరుగు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 3 వికెట్లు తీయగా.. బ్రాండన్ గ్లోవర్, బాస్ డి లీడె రెండేసి 2 వికెట్లు తీశారు. 118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధించింది. మాక్స్ డౌడ్ హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. టామ్ కూపర్ 29 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా, ముజారబానీ దీవెనా మూడు వికెట్లు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com