ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. ఆధ్వర్యంలో రాస్తారోకో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:44 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గాంధీ సర్కిల్ లో గాంధీ విగ్రహానికి బి. కె. పార్థసారథి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన ర్యాలీ ని చేపట్టారు. ఈ సందర్బంగా స్థానిక ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద రోడ్డు పై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్థంభించింది. అదేవిధంగా మానవహారం చేపట్టి, ఎన్ టి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ రాయలసీమ పట్టుబధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గం అధ్యక్షులు చిన్నిప్పయ్య, నాయకులు కురుబ కృష్ణమూర్తి, కేశవయ్య, వెంకటరాముడు, కన్వీనర్ లు సోమశేఖర్, సిద్దలింగప్ప, నరహరి, లక్ష్మిరెడ్డితోపాటు నాయకులు నరసింహప్ప, సుధాకర్ రెడ్డి, అశ్వర్థ రెడ్డి, అజమతుల్లా, రఘువీర చౌదరి, వేణు, నరేంద్ర, నరేష్ తో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com