తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు శ్రీనివాసుని ఆలయానికి రూ.1.02 కోట్ల విరాళం అందజేశారు. ఈ మొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, శ్రీ పద్మావతి భవనంలో ఫర్నిచర్ కోసం రూ.87 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈవో ధర్మారెడ్డికి ఈ మొత్తాన్ని దాతలు అందించారు.