రాష్ట్ర ప్రభుత్వం పలువురు డిప్యూటీ తహసీల్దార్లకు శుభవార్త చెప్పింది. 83 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏకు తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసింది. తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ లచ్చిరెడ్డి, టీజీటీఏ కృషి ఫలితంగానే డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని తహసీల్దార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
ఇంతకు ముందు కూడా టీజీటీఏ కృషి ఫలితంగానే పదోన్నతులు లభించాయని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్, సెక్రటరీ జనరల్ పూల్సింగ్ చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధకు ధన్యవాదాలు తెలిపారు.