ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్ల నియామకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 01:02 PM

రాష్ట్రంలోని ఏడు వ్యవసాయ మార్కెట్​ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. ఆయా మార్కెట్​ కమిటీలకు చైర్మెన్లు, వైస్ చైర్మన్లులను నియమించారు. ఈ ఏడు మార్కెట్​ కమిటీలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్​, కామారెడ్డి జిల్లాలోని గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించారు.
మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​గా బెక్కరి అనితా రెడ్డి, వైస్ చైర్ పర్సన్​గా గడుగు విజయ్ కుమార్, వెల్గటూర్​ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గుండటి గోపిక, వైస్ చైర్ పర్సన్​గా గొల్ల తిరుపతి, గాంధరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్ పర్సన్​గా ఆకుల లక్ష్మణ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​గా మాలోతు సంధ్య, వైస్ చైర్ పర్సన్​గా జక్కుల రాజారెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​గా మారెడ్డి రజిత, వైస్ చైర్ పర్సన్​గా జొన్నల రాజు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​గా వెన్నపూసల సీతరాములు, వైస్ చైర్ పర్సన్​గా కొండపర్తి సురేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరు హరినాథ బాబు, వైస్ చైర్ పర్సన్​గా వనవాసం నరేందర్ రెడ్డిని నియమించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com