రాష్ట్రంలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. ఆయా మార్కెట్ కమిటీలకు చైర్మెన్లు, వైస్ చైర్మన్లులను నియమించారు. ఈ ఏడు మార్కెట్ కమిటీలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్, కామారెడ్డి జిల్లాలోని గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించారు.
మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా బెక్కరి అనితా రెడ్డి, వైస్ చైర్ పర్సన్గా గడుగు విజయ్ కుమార్, వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గుండటి గోపిక, వైస్ చైర్ పర్సన్గా గొల్ల తిరుపతి, గాంధరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్ పర్సన్గా ఆకుల లక్ష్మణ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా మాలోతు సంధ్య, వైస్ చైర్ పర్సన్గా జక్కుల రాజారెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా మారెడ్డి రజిత, వైస్ చైర్ పర్సన్గా జొన్నల రాజు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా వెన్నపూసల సీతరాములు, వైస్ చైర్ పర్సన్గా కొండపర్తి సురేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరు హరినాథ బాబు, వైస్ చైర్ పర్సన్గా వనవాసం నరేందర్ రెడ్డిని నియమించారు.