ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణ శివారులోని ఆరపేట వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా శుక్రవారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
నేషనల్ హైవే డివైడర్ల మధ్యలో చెట్ల మొక్కలను అందంగా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణకు ఆంటీ లార్వా స్ప్రే, ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, డి ఈ నాగేశ్వరరావు, సానిటేషన్ ఇన్సెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, మహేష్, శేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.