కమీషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి) ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సమూదాయల యందలి సమావేశ మందిరం లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లెదవాఖాన) లలో పని చేయుచున్న యం.ఎల్.హెచ్.పిలకు హేచ్.ఐ.వి. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుటకు ఒక రోజు (1) శిక్షణ నిర్వహించామని డా. కె. ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అదికారి, పెద్దపల్లి అన్నారు. ఇప్పటి నుండి జిల్లాలోని వివద ఆసుపత్రులలో గల ఐ.సి.టి.సి కేంద్రములతో పాటు పల్లె దవాఖానలో కూడా హెచ్.ఐ.వి. పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.
వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమములో డా. జి. అన్నప్రసన్న కుమారి, ఎ.డి.పి.హెచ్.ఒ, డా. కె.వి. సుధాకర్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మెనెజర్, కె. సురెందర్ రెడ్డి, పి. ఆర్. శ్రీనివాస్, జిల్లా ఐ.సి.టి.సి. సూపర్ వైజర్, జి. శంకర్, కట్కూరి శంకర్, సత్యానందం , రవికుమార్ జిల్లా ఐ.సి.టి.సి. కౌన్సిలర్ లు పాల్గోన్నారు.