పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జరిగిన రెండవ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోచారం వృషం రెడ్డి రెండు బంగారు పథకాలు సాధించడంతో పోచారం కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడైన రుశాంక్ రెడ్డి చిన్ననాటి నుండి ఆటలపై మక్కువ చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.