నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి పానగల్ ఎస్ఐ కళ్యాణ్ రావు ద్విచక్రవాహన దారుడిపై దాడి చేసిన సంఘటనలో మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్పందించారు. ఎస్ఐ కళ్యాణ్ రావును పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసినట్లు తెలిపారు. సిసిఏ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన ఎస్ఐపై పూర్తి విచారణ చేయాలని మల్టీజోన్-II ఐజి విచారణకు ఎస్పిను ఆదేశించారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.