మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. నియోజకవర్గానికి చెందిన దాదాపు 25 మంది మాజీ సర్పంచ్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మంగళవారం సమావేశమైన వారు త్వరలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.