పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన గుడెల్లి అనూష గత కొన్ని రోజులుగా పేగు కేన్సర్ తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు గుడెల్లి శ్రీకాంత్ కెసిఆర్ సేవా దళం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కు వివరించడంతో వెంటనే స్పందించి చికిత్స కోసం మంగళవారం తానే స్వయంగా రూ. 10వేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ సొల్లు పద్మ శ్యామ్, ఉపసర్పంచ్ చొప్పరి నర్సింహం, చిగురు రవీందర్ రెడ్డి, రాజయ్య, బొద్దుల నారాయణ, సాయినాథ్, చిప్ప శ్రీకాంత్, కనకయ్య, వీరేశం, భూమయ్య, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల అజిత్ పాల్గొన్నారు.