ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల రోజుల్లో పార్టీని ప్రకటిస్తా: గద్దర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 10:56 AM

కళాకారులు, జర్నలిస్టులు సమక్షంలో నెలరోజుల్లో పార్టీని ప్రకటిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రకటించారు. సోమవారం సరూర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీగా ఆయన పేర్కొన్నారు. 2018 లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్దర్ తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గద్దర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల సమయంలో గద్దర్ తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. తనకు భద్రతను పెంచాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. మావోయిస్టు పార్టీతో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన గద్దర్ జనజీవన స్రవంతిలో కలిశారు. 2018 ఎన్నికల సమయంలోనే గద్దర్ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అదే సమయంలో తొలిసారిగా ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com